కొవ్వూరు తూర్పు గోదావరి జిల్లా:గణపతి నవరాత్రి మహోత్సవాలు సందర్భంగా కొవ్వూరు టౌన్ లో ఏర్పాటు చేసిన పలు గణేష్ మండపాలను రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత సదర్శించి, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. సోమవారం వినాయక చవితి సందర్భంగా గణపతి నవరాత్రి మహోత్సవాల్లో మొదటి రోజున స్థానికులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. మొదటగా కొవ్వూరు టౌన్ లోని రౌండ్ రామాలయం వద్ద ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని సందర్శించారు. అనంతరం వరుసగా మెరకవీధిలోని వినాయకుడి గుడి, 22వ వార్డులో పోతురాజు గుడి వీధి, సుబ్రహ్మణ్యేశ్వర ఘాట్ వద్ద, 5వ వార్డు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి వీధి, గాయత్రి థియేటర్ వద్ద, 10వ వార్డు ఫ్యాక్టరీ రోడ్ లోని రామాలయం వద్ద, 15వ వార్డు శ్రీనివాసపురం రామాలయం వద్ద ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను హోంమంత్రి సందర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు ఆయురారోగ్యాలు అందించాలని, ప్రజలందరినీ చల్లగా చూడాలని, రాష్ట్ర ప్రగతికి విఘ్నాలు రాకుండా చూడాలని విఘ్నేశ్వరుడిని ఈ సందర్భంగా హోంమంత్రి ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
[zombify_post]