Mithun Reddy- పార్లమెంట్ సమావేశాలు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ నిబంధనల ప్రకారమే చంద్రబాబు అరెస్టు జరిగిందని.. ఆయన తప్పు చేసినట్టు పూర్తి ఆధారాలు ఉన్నాయని.. ఇందులో రాజకీయ ప్రమేయం లేదని.. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం లేదని చెప్పుకొచ్చారు. దీనిపై రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) ఖండించేందుకు ప్రయత్నించగా మిథున్ రెడ్డి అడ్డుకున్నారు. ” కూర్చో రా బాబు కూర్చోరా ” అంటూ మాట్లాడారు, సహచర ఎంపీ అన్న కనీస గౌరవ మర్యాదలు కూడా ఇవ్వకుండా రామ్మోహన్ నాయుడుని ఏక వచనంతో సంబోధించారు.
