in ,

సచివాలయం భవనాన్ని ప్రారంభించిన మంత్రి వనిత

చాగళ్లు మండల పరిధిలోని దారవరం గ్రామంలో 57 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన సచివాలయ భవనం, డాక్టర్ వైఎస్సార్ హెల్త్ సెంటర్ ను రాష్ట్ర హోంమత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత ప్రారంభించారు.  దారవరంలో హోంమంత్రి  శిలాఫలకం ఆవిష్కరించి, రిబ్బన్ కత్తిరించి నూతన భవనాలను ప్రారంభించారు. ముందుగా స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ… నవరత్నాల ద్వారా గ్రామంలోని ప్రతి ఇంటికి అమ్మ ఒడి, చేయూత, విద్యాదీవేన, జగనన్న విద్యా కానుక, జగనన్న చేదోడు, వివిధ రకాల పెన్షన్లు వంటి వివిధ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరేలా ప్రభుత్వం ప్రతి గ్రామంలో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి, ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ద్వారా ఇంటికి లబ్ధి చేకూరేలా కృషి చేస్తుందని అన్నారు. గత ప్రభుత్వం ప్రజలకు ఏమి చేయకపోగా జన్మభూమి కమిటీల పేరుతో ఆఫీసుల చుట్టూ, నాయకుల చుట్టూ ప్రజలను తిప్పుకున్నారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ప్రతిపక్షాలన్నీ కలిసి పొత్తు కుదుర్చుకునేందుకు నాన్న తంటాలు పడుతున్నాయని.. మళ్లీ ఎన్నికలు వస్తున్న సందర్భంగా గ్రామాల్లోకి మాయమాటలు చెప్పేందుకు నాయకులు వస్తుంటారని తెలిపారు. గత ప్రభుత్వంలో తమ తమ గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి పనులు చేశారో ప్రతిపక్ష నాయకులను ప్రజలు నిలదీయాలన్నారు. ప్రతిపక్ష నాయకుల మానసిక పరిస్థితి ఎలా ఉందో పరీక్షించుకోవాలని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి, జగనన్న ప్రభుత్వంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి పై ఎలాంటి చర్చకైనా సిద్దమని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో ప్రజల కష్టాలను తెలుసుకొని చేస్తానని ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ప్రజల గుండెల్లో మంచి స్థానం సంపాదించుకున్నారని.. మీ ఇంటి బిడ్డను మరోసారి ఆశీర్వదించాలని హోంమంత్రి తానేటి వనిత  కోరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గ నాయకులు, గ్రామ సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Nasa

సూర్యుడు ఇలా ఉంటాడేమో.. నాసా

వేట సాగక.. పూట గడవక..!”