ఖమ్మం నగరంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో (సంజీవ రెడ్డి భవన్) ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతల సమావేశం నిర్వహించ నున్నారు. దీనికి ఏఐసీసీ నుంచి ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల పరిశీలకులు ఆరీఫ్ నసీమ్ ఖాన్ ముఖ్యఅతిథిగా హాజరవుతారు. ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ లతో కలిసి పాల్గొంటారు. ఈ సమావేశానికి ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, శీనన్న అభిమానులు హాజరు కావాల్సిందిగా పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇంఛార్జీ తుంబూరు దయాకర్ రెడ్డి కోరారు.
[zombify_post]