రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండల పరిధిలో ఒక వ్యక్తి నిషేధిత గుడుంబా కలిగి ఉన్నాడనే ఖచ్చితమైన సమాచారం మేరకు అట్టి వ్యక్తి ని పట్టుకొని కేసు నమోదు చేసినట్టు రూరల్ ఎస్ ఐ మారుతీ తెలిపారు.ఎస్ ఐ మారుతీ తెలిపిన వివరాల ప్రకారం కోనరావుపేట మండలం వట్టిమల్ల గ్రామానికి చెందిన డొక్కా నారాయణ అనే వ్యక్తి ప్రభుత్వ నిషేధిత గుడుంబా ని కలిగి ఉన్నాడనే సమాచారం మేరకు ఎస్ ఐ మారుతీ సిబ్బంది తన సిబ్బంది ఏ ఎస్ ఐ లకపతి, హెడ్ కానిస్టేబుల్ రాజేందర్, కానిస్టేబుల్ లు ఆరీఫ్,శంకర్, సతీష్, శ్రీనివాస్, రాజశేఖర్ లు కలిసి అట్టి వ్యక్తి ని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి (33) గుడుంబా పాకెట్ లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ మారుతీ తెలిపారు.

[zombify_post]