పాడేరు విచ్చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి పాడేరు శాసనసభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అల్లూరి జిల్లా అధ్యక్షులు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి శనివారం మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలు విన్నవించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాలు అందజేశారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్ల పట్టాల మంజూరు చేశారు గాని, ప్రతిపక్షాల వేసిన కారణంగా వాటి నిర్మాణాల ముందుకు సాగడం లేదని ఆ సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు. అదేవిధంగా మైదాన ప్రాంతాలకు, ఏజెన్సీ ప్రాంతాలకు గృహ నిర్మాణంలో ఉన్న ఇబ్బందులను తెలియజేస్తూ నిబంధనలను సడలించి గృహ నిర్మాణాలు లబ్ధిదారులకు అదనపు సహకారం అందించాలని కోరారు. అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన చాలాచోట్ల అంగన్వాడీలు శిథిలాలకు చేరుకున్నాయని, మరికొన్ని చోట్ల అద్దె భవనాల్లో నడుస్తున్నాయని వాటి స్థానంలో నూతన భవనాలను మంజూరు చేయాలని, మరమ్మతులకు గురైన వాటిని నిధులు మంజూరు చేయాలని కోరారు. కొన్నిచోట్ల పాఠశాల భవనాలు కూడా మరమ్మతులకు గురయ్యాని వాటికి కూడా నిధులు రిలీజ్ చేయాలని కోరారు.
[zombify_post]