దేశ చరిత్రలోనే మహాత్మా గాంధీ కలలగన్న గ్రామ స్వరాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న ఘనత గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్పాకుతుందని పాడేరు శాసనసభ్యులు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు. జీకే వీధి మండలం ధారకొండ గ్రామ సచివాలయం పరిధిలోని కొంగపాకలు, వర్తండపాడు, పెంటల గెడ్డ, డి.కొత్తూరు, కమ్మరి తోట, చీడిగుంట, తోకరాయి, భీములు పాకలు గ్రామాలలో గురువారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాడేరు శాసనసభ్యులు శ్రీమతి కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 325 గడపలను సందర్శించారు. ఈ నాలుగున్నరేళ్ల కాలంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యక్తిగతంగా అందించిన సాయాన్ని గణాంకాలతో సహా వివరించారు. గ్రామాల అభ్యున్నతికి ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న కార్యక్రమాలు ప్రజలకు వివరించారు. ఏ సంక్షేమ పథకం ద్వారా ఎంతెంత లబ్ధి చేకూరుతుందన్న విషయంపై అవగాహన కల్పించారు. ప్రజా సమస్యలు తెలుసుకొనేందుకే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని జగనన్న ప్రవేశపెట్టారని తెలిపారు. గెలిపించిన ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న నవరత్నాల పథకాలు పేద, బడుగు, బలహీన వర్గాల అర్ధికాభివృద్ధికి ఎంతో దోహదపడుతున్నాయన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలు గ్రామాల్లోని అందిస్తున్నామని చెప్పారు. ఒకటో తేదీ ఉదయాన్నే వాలంటీర్లు తలుపు తట్టి అవ్వతాతలు, వితంతువు, దివ్యాంగులకు ఫించన్లు అందజేస్తున్నామని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా పథకాల మంజూరు చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో టిడిపి సానుభూతిపరులకు, జన్మభూమి కమిటీ ఇచ్చిన వారికే పథకాలు అందించాయని గుర్తు చేశారు. గ్రామాల్లో తక్షణ పరిష్కరించాల్సిన సమస్యల కోసం గిరిజన ప్రాంతంలో ప్రతి సచివాలయానికి ప్రభుత్వం రూ.40 లక్షల మంజూరు చేస్తుందన్నారు. సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యమిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి ని మరోసారి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఎం.రాజు, స్థానిక ఎంపీటీసీ ఎం. రమణ, సీనియర్ నాయకులు, బిసి సెల్ అధ్యక్షులు పిల్లా బుజ్జి, తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]