అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం చింతపలతలి మండలంలో భారీ వర్షానికి ఓ ఇల్లు కూలిపోయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని గురువారం ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి కుడుముసార గ్రామానికి చెందిన పాంగి నారాయణమ్మ కు చెందిన మట్టి ఇల్లు కూలిపోయింది. ఆ సమయంలో నారాయణమ్మ బయటకు వెళ్ళడంతో పెను ప్రమాదం తప్పింది. నిరుపేద రాలైన నారాయణ మ్మ ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
[zombify_post]