*ఏ ఉద్యమమైనా అణచివేత నుండె మొదలవుతుంది..✊*
*🇮🇳భారత జాతీయోద్యమంలోనే ఒక విలక్షణమైన ఉద్యమం "తెలంగాణా విమోచనోద్యమం" అని గళమెత్తిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ పవార్ రామారావు పటేల్ గారు ….*
భైంసా పట్టణంలోని SS ఫ్యాక్టరీ నందు బీజేపీ రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం,విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి *నైజాం విముక్త అమృతోత్సవాలు* వేడుకల్లో భాగంగా *🇮🇳త్రివర్ణపతాకాన్ని* ఆవిష్కరించిన ముధోల్ నియోజక వర్గ బీజేపీ నాయకులు *శ్రీ పవార్ రామారావు పటేల్ గారు*.. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ..
తెలంగాణ తనువెల్లా, నిలువెల్లా గాయాలున్నాయి. నిజాం నవాబు రజాకార్ల అండతో హైదరాబాద్ను తెలంగాణను ఏలినప్పుడు ప్రజలపై జరిపిన దారుణాలు అన్నీ ఇన్నీ కావు.. భూస్వాముల ఆగడాలు, పెత్తందారీ పోకడలను అన్నింటినీ భరించింది తెలంగాణ గడ్డ సత్యాగ్రహాల నుంచి సాయుధ పోరాటం వరకూ తెలంగాణ పోరాట గతిలో ఎన్నెన్నో ఆయుధాలు. మరెన్నో అస్త్రాలు మట్టి మనుషుల నుంచి మహావీరుల వరకూ అందరూ కదలి వచ్చారు. నిరుపేద సైతం పెత్తందారీ పోకడలపై పోరుసల్పి మహా వీరుడయ్యాడు. సామాన్య మానవులు, తమ అసాధారణమైన పోరాటగతితో మహానాయకులుగా రూపొందారు. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఉద్యమించారు. లెక్కలేనన్ని త్యాగాలు చేశారు. ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు. అని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో వారితో పాటు పలు గ్రామాల సీనియర్ బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]
