కల్లూరు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అధిక ధరలు, నిరుద్యోగం, ఉపాధి కుదింపులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమంలో భాగంగా కల్లూరు ఆర్టీవో కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దేశంలో రోజురోజుకీ నిత్యవసర సరుకుల ధరలు అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్నాయి. దేశంలో కోట్లమంది ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారు. వీరిపై పన్నుల భారం పెంచి మరింత దారిద్ర్యంలోకి నెడుతున్నారు. ప్రజలకు కొనుగోలు శక్తి దెబ్బతినే విధంగా ఉపాధి ఆదాయం తగ్గింది కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా పేదల పైనే భారాలన్ని మోపి పేద ప్రజానీకం జీవితాలను దుర్భరం చేస్తున్నాయి. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావసరాలను దృష్టిలో పెట్టుకొని నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టపరిచి 14 రకాల సరుకులను రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయాలని ఉద్యోగ కల్పన, గ్రామీణ ప్రాంతాల్లోఉపాధి హామీ పథకం కింద 200 రోజులు పని దినాలను కల్పించాలని, అలాగే గ్రామీణ వ్యవసాయాన్ని పట్టణ పరిశ్రమలను కార్పొరేట్లకు ధారధత్వం చేయకుండా కాపాడాలని మహిళలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ వినతి పత్రం ఆర్డిఓకి ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో కల్లూరు మండలం సిపిఎం పార్టీ మండల కార్యదర్శి మాదాల వెంకటేశ్వరావు, ఐద్వా మండల కార్యదర్శి తన్నీరు కృష్ణవేణి, గొర్రెల మేకల సంఘం కార్యదర్శి బట్టు నరసింహారావు, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు దోమ తొట్టి పుల్లయ్య, పార్టీ సభ్యులు నాయుడు చంద్రరావు, రేసు నాగేశ్వరావు, ముంత మల్లయ్య, తదితర నాయకులు పాల్గొన్నారు.
[zombify_post]