కె.కోటపాడు, అనకాపల్లి జిల్లా: చంద్రబాబు నాయుడు తెలివితేటలు అన్నీ అవినీతి చేయడానికే ఉపయోగించడాని ఈ అరెస్ట్ తో రుజువైందని డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు అన్నారు. శనివారం ఆయన అనకాపల్లి జిల్లా, కె.కోటపాడులో మీడియాతో మాట్లాడుతూ….చంద్రబాబు నాయుడు పూర్తిగా నిర్వీర్యం అయ్యారని తన బస్ యాత్ర, లోకేష్ యువగళం యాత్రల ద్వార రుజువైంది. తెదేపా నాయకులనే జలగల పట్టి పిడించిన చంద్రబాబుకు ఈ అవినీతి లెక్కే కాదు.ప్రజలు చంద్రబాబు కి బుద్ధి చెప్పిన తన వైఖరి మారలేదు. ప్రభుత్వం మీద బురదజల్లే ప్రయత్నం ఇకనైనా తెదేపా నేతలు మానుకోవాలి.ప్రజలకు ప్రభుత్వ సహకారంతో చేతనైన సహాయం చేయాలని పిలుపునిచ్చారు.ప్రజలను తప్పుడు విధానాలతో రెచ్చగొట్టే వైఖరి మానుకోవాలి. వ్యవస్థలో ఉన్నప్పుడు అవినీతి లేకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి చర్యలు ఏ ఒక్కరికి క్షేమం కాదు. ప్రభుత్వ డబ్బు రూ.371 కోట్లు అవినీతి జరిగింది. కేబినెట్ను తప్పుదారిపట్టించి ఆ తర్వాత ఒప్పందంలో మరొకటిపెట్టి… డబ్బులు కాజేశారని అభియోగాలు.స్కిల్ డెవలప్మెంట్ పేరిట స్కాం ఇది. జీఎస్టీ, ఇంటెలిజెన్స్, ఐటీ, ఈడీ, సెబీ… ఇలా ఏజెన్సీలన్నీ కూడా దర్యాప్తుచేసిన స్కాం ఇది.
దోచేసిన సొమ్మును విదేశాలకు, అక్కడనుంచి తిరిగి దేశంలోకి వచ్చింది. చంద్రబాబుగారు జూన్ 2014లో అధికారం చేపట్టిన 2 నెలలకే ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కాంకు ఊపిరి అన్నారు. ప్రాజెక్టు మొత్తం ఖర్చు రూ. 3,356 కోట్లని, ఇందులో ప్రభుత్వ వాటా 10 శాతం అని, 90 శాతం సీమెన్స్ పెట్టుకుంటుందని చెప్పారు. అంటే దాదాపుగా రూ.౩ వేల కోట్ల రూపాయలు సీమెన్స్ ఇస్తుందని చెప్పారు. తమకు తాముగా తయారుచేసుకున్న అంచనా వ్యయాన్నే డీపీఆర్గా చూపిస్తూ స్కిల్డెవల్మెంట్ నుంచి నోట్ పెట్టించారు. ఇక ప్రభుత్వంలో సెక్రటరీ స్థాయి, ఆపైస్థాయి అన్నింటినీ ఓవర్రూల్ చేస్తూ కేబినెట్లోకి ఈనోట్ను తీసుకొచ్చారు. అదీ ఒక స్పెషల్ ఐటెంగా. కేబినెట్లోకి అలా రావడం, వెంటనే దానికి ఓకే చెప్పడం, తర్వాత జీవో విడుదల కావడం… అన్నీ ఆగమేఘాలమీద జరిగిపోయాయి. ఈపద్ధతిలో కేబినెట్కు నోట్ పెట్టడం అన్నది నియమాలకు, నిబంధనలకు, రూల్స్కు పూర్తిగా విరుద్ధం. ఇక ఒప్పందం విషయానికొస్తే.. జీఓ ఒకలా ఉంటుంది, ఒప్పందం ఇంకోలా ఉంటుంది.
జీవోలో ఉన్నది… ఒప్పందంలో లేనప్పుడు సంతకాలు ఏలా చేశారు అని ప్రశ్నించారు . సీమెన్స్ నుంచి రావాల్సిన గ్రాంట్ ఇన్ ఎయిడ్గా ఒక్కపైసాకూడా రాకుండానే 5 దఫాలుగా ప్రభుత్వం రూ. 371 కోట్లు ఎలా విడుదలచేసింది. డబ్బు విడుదలపై ఆర్థికశాఖ అధికారులు కొర్రీలు పెడితే… విడుదల చేయమని చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా అప్పటి ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ తన నోట్ఫైల్లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే విడుదలచేయమని ఆదేశాలు ఇచ్చినట్టుగా రాశారు. సీఎం చెప్పారు కాబట్టి విడుదలచేయమని చీఫ్ సెక్రటరీ నేరుగా ఫైలుపై రాశారు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వం నుంచి విడుదలచేసిన ఈ డబ్బు పోయింది. మన అధికారులేకాదు… సీమెన్స్ సంస్థకూడా ఇంటర్నల్ ఎంక్వయిరీ చేసి… 164 సీఆర్పీసీ కింద ఏకంగా మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. ప్రభుత్వం జారీచేసిన జీవోకు, ఎంఓయూకు ఎలాంటి సంబంధం లేదని వాళ్లు కోర్టుకు తెలిపారు. తమ కంపెనీలో పనిచేసే సుమన్బోస్ అనే వ్యక్తి మేనేజ్మెంట్నుగాని, లీగల్టీమ్కాని సంప్రదించలేదని సీమెన్స్ వాళ్లు ఏకంగా కోర్టుకు తెలియజేశారు. ఈడబ్బు 70కిపైగా షెల్ కంపెనీల ద్వారా చేతులు మారి మారి తిరిగి వచ్చింది. వాస్తవంగా ఈ స్కిల్డెవలప్మెంట్ స్కాం గురించి ఒక వ్యక్తి రాష్ట్రంలో ఏసీబీ కి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ప్రభుత్వానికి ఒక విజిల్బ్లోయర్ ఈ రకంగా జూన్ 2018న ఒక హెచ్చరిక జారీచేశారు. విచారణ మొదలుపెట్టి… దాన్ని ముందుకు కొనసాగనీయకుండా పక్కన పెట్టేశారు. ఇది ఎప్పుడైతే జరిగిందో… వెంటనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నోట్ఫైల్స్ను మాయం చేసేశారని ఆరోపించారు. స్కిల్ స్కాంలో ప్రధాన పాత్ర పోషించిన పీవీఎస్పీ/ స్కిల్లర్, డిజైన్టెక్ … ఈరెండు కంపెనీలు సర్వీస్ ట్యాక్స్ కట్టకుండా సెన్వాట్కోసం క్లెయిమ్ చేశాయి. ఇన్ని కోట్ల రూపాయల మేర క్లెయిం చేయడంతో జీఎస్టీ అధికారులకు అనుమానం వచ్చి… ఆ కంపెనీ లావాదేవీలపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టారు. డబ్బులు హవాలా మార్గంలో తరలించినట్టు వెల్లడైంది. 2017లోనే ఇది బయటపడింది. అప్పుడు కూడా అప్పటి ప్రభుత్వం స్పందించలేదన్నారు.
[zombify_post]
