- కొవ్వూరు: ప్రభుత్వ పశు వైద్యశాలలో రైతులకు సరైన వసతులు లేని పరిస్థితి నెలకొంది. పశువులను వైద్యానికి తీసుకువచ్చిన రైతులకు కూర్చోవడానికి కొవ్వూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సిమెంట్ బెంచీలను ఏర్పాటు చేశారు. లయన్స్ క్లబ్ కోశాధికారి ఉప్పులూరి రామకృష్ణ ఆర్థిక సహకారంతో ఈ బెంచీలను ఏర్పాటు చేసినట్లు లయన్స్ క్లబ్ అధ్యక్షులు కలగర వెంకట్రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి పెనుమాక జయరాజు, కోశాధికారి ఉప్పులూరి రామకృష్ణ లయన్స్ క్లబ్ సభ్యులు బూరుగుపల్లి వెంకటేశ్వరరావు,గోలి వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!
