కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం యస్వాడ గ్రామంలో ఇంకుడుగుంతలో పడి మూడేండ్ల బాలుడు మృతి చెందాడు. గువ్వ సంధ్య, తిరుపతి దంపతుల కొడుకు సాజన్(3) మంగళవారం ఉదయం ఇంటిబయట ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇంటికి ఎదురుగా గ్రామ పంచాయతీ వద్ద ఉన్న పబ్లిక్ వాటర్ ఇంకుడుగుంతలో పడ్డాడు, పైకి తీసి గన్నేరువరం దవాఖానకు తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
