రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట) సాంస్కృతిక సారథి చైర్మేన్, మానకొండూర్ శాసన సభ్యులు డాక్టర్ రసమయి బాలకిషన్ మండల ప్రజా ప్రతినిధుల సమావేశాని హజరై అనంతరం మండలంలో వివిధ గ్రామాలకు చెందిన లబ్దిదారులకు సుమారు 20లక్షల రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కులు పంఫణి చేసి,మండల కేంద్రంలో పలు అభివృద్ది పనులకు భూమి పూజ చేసినారు.ఈ నెల15 వ తేది శుక్రవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా వర్చువల్ గా మెడికల్ కాలేజ్ ప్రారంభం చేసుకుంటున్న శుభ సందర్భంగా ఇల్లంతకుంట మండలం నుండి ప్రజా ప్రతినిధులు,బీఆర్ఎస్ పార్టీ నాయకులు,శ్రేణులు భారిగా తరలివచ్చి ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు,మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు కృతజ్ఞతగా ర్యాలీ,కృతజ్ఞత సభను విజయవంతం చేయాలి అని పిలుపునిచ్చారు.ప్రజా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక పల్లె పల్లెనా అభివృద్ది జరుగుతుందని,సమైక్య పాలనలో అన్నీ సమస్యలేనని తాగునీరు, సాగునీటికి దూరం చేశారని అన్నారు.కరంటు లేక గ్రామాలు విలవిలలాడాయని తెలంగాణ ప్రభుత్వంలో 24 గంటల కరంటు మిషన్ భగీరథతో తాగు నీరు ఎత్తిపోతల పథకాలు పూర్తి చేసిందన్నారు.నాడు వలసెల్లిన పల్లెలు ఇప్పుడు కళకళ లాడుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. సీయం కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష అని కేవలం ఎనిమిదేండ్లలోనే ఎంతో పురోగతి సాధించిందన్నారు. గ్రామాలలో ప్రజలను కలుపుకుని సామూహికంగా గ్రామ వికాసానికి పాటు పడాలని పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీలకు అవసరమైన నిధులు, విధులు కేటాయిస్తామని, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు బాధ్యతగా పనిచేయాలని కోరారు.మంచి నీటి సరఫరా, విద్యుత్ సరఫరా, రహదారుల నిర్మాణం లాంటి ముఖ్యమైన పనులన్నీ ప్రభుత్వమే నేరుగా చేస్తున్నందున గ్రామాల్లో పచ్చదనం పెంచడం, పరిశుభ్రత పాటించడం, వైకుంఠధామాల (స్మశాన వాటికలు) నిర్మాణంపై పంచాయతీలు ఎక్కువ దృష్టి పెట్టాలని అన్నారు.అలాగే నిరుపేద కుటుంబాల ఆడబిడ్డల పెండ్లి ఖర్చుల కోసం కళ్యాణలక్ష్మీ,షాదీ ముబారక్ పథకాలకు ప్రతిష్టాత్మకంగా అంకురార్పణ చేసింది తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు.ఆడపిల్లల తల్లిదండ్రులు పడుతున్న ఆగచాట్లను అర్థం చేసుకున్న సీఎం కేసీఆర్ ఆడపిల్ల పెళ్లి అంటే తల్లిదండ్రులకు తలకు మించిన భారం కావద్దన్న ఉద్దేశ్యంతో బాధ అన్నదే దరి చేరనీయకుండా పచ్చని పందిట్లో ఆడపిల్ల సంతోషంగా ఏడడుగులు నడవాలని18 ఏండ్లు నిండిన యువతుల పెండ్లికి ఆర్థికంగా చేయూతనందించేందుకు 1,00,116/- రూ!!వివాహ కానుకగా అందిస్తూ ఆడబిడ్డ తల్లిదండ్రుల ఇంట ఆనందాలు కురిపిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు.మన దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వం కూడా పేదింటి ఆడబిడ్డల పెండ్లికి ఇలాంటి గొప్ప కానుకలు ఇవ్వడం లేదని అన్నారు.ఇట్టి కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మేన్ సిద్దం వేణు, ఎంపిపి వూట్కూరి వెంకట రమణా రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు , ఎంపీటీసీలు, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]