రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం లోని తడగొండ గ్రామానికి చెందిన గీత కార్మికుడు బత్తిని మల్లయ్య గౌడ్ కులవృత్తి లో భాగంగా మంగళవారం రోజు ఉదయం కళ్ళు గీసేందుకు వెళ్ళగా తాటి చెట్టు పై నుండి జారిపడి తీవ్ర గాయాలుకాగ తోటి గీతా కార్మికులు ఆస్పత్రికి తరలించారు.గౌడ సంఘం నాయకులు ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్, గ్రామ గౌడ సంఘం అధ్యక్షులు ఉయ్యాల రమేష్ గౌడ్, ఉపాధ్యక్షులు బండారి మహేందర్ గౌడ్, చింతలకోట మహేష్ గౌడ్, గీతా కార్మికుని ప్రభుత్వం ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరారు.
[zombify_post]
