కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ అధిక ధరలు, నిరుద్యోగం, ఉపాధి కుదింపునకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం సత్తుపల్లి లో ఆధ్వర్యంలో చేపట్టారు. సి.పి.ఎం మండల కార్యదర్శి జాజిరి శ్రీనివాస్ మాట్లాడుతూ సిపిఎం కేంద్ర కమిటీ పిలుపుమేరకు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కాకర్లపల్లి శాఖ ఆదర్యంలో గ్రామ పంచాయితీ ఆఫీసు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. రేషన్ కార్డులు లేక గృహలక్ష్మి,, బీసీ, మైనార్టీ, దళిత బంద్ వంటి పథకాలకు అర్హత ఉన్న దరఖాస్తు చేసుకోలేకపోతున్నా అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రభువైన వారందరికీ అందించాలంటే గ్రామ సభల ద్వారానే ఎంపిక చేయాలన్నారు. కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు అనుసరించే ప్రమా వ్యతిరేక విధానాలపై సిపిఎం నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు వేపుల పాటి కుమారస్వామి, సిపిఎం నాయకులు కొలికోపోదు సర్వేశ్వరరావు, బండి వేలాది, భిక్షం, లక్ష్మినారాయన, షేక్ ఖాన్ అహ్మద్, చిట్టెమ్మ తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]