విశాఖపట్నం:ఏ వ్యవస్థలోను ఎవరికి లేని గౌరవం కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే ఉందనీ,రోడ్డు మీద నడిచే సైకిల్ నుండి అంతరిక్షయానం చేసేలా మలిచే గొప్ప దిషలులు.అన్ని వ్యవస్థలలో ఉన్న వారిని తయారు చేసే శక్తి సామర్థ్యాలు ఉపాధ్యాయులనీ, కట్టమంచి రామలింగారెడ్డి కొన్వోకేషన్ హాల్ వేదికగా ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి గురుపూజోత్సవ వేడుకలో డిప్యూటీ సిఎం ముత్యాల నాయుడు అన్నారు. అనంతరం విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో సిఎం జగన్ సారథ్యం లో గణనీయమైన మార్పులు వచ్చాయాని, దేశంలో ఎక్కడ లేని విధంగా విద్య వ్యవస్థ అభివృద్ధికి పెద్ద పీట వేశారని అయన అన్నారు. ఈ సంధర్భంగా సియం జగన్ అందించిన సందేశాన్ని ప్రభుత్వ కార్యదర్శి వినిపించారు. విద్య శాఖకు సంబంధించిన పలు అంశాలను సభ ముఖంగా వెల్లడించారు. కార్యక్రమం అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులకు బహుమతుల ప్రదానం చేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్, నగర మేయర్ జిల్లా చైర్పర్సన్, అనకాపల్లి జిల్లా ఎంపీ సత్యవతి, ఉన్నతాధికారుల ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
[zombify_post]