అనకాపల్లి జిల్లా: పిడుగుపాటుకు యువకుడు మృతి చెందిన సంఘటన సోమవారం సాయంత్రం అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం….జోగంపేట గ్రామానికి చెందిన సూదిపరపు జయంత్ అనే యువకుడు పాత మల్లంపేట లోని సచివాలయానికి బయలు దేరాడు. ఇంతలో భారీ వర్షం పడటంతో సమీపంలో ని చింతచెట్టు కిందకు వెళ్ళాడు. అయితే ఆకస్మాత్తుగా పిడుగు పడటంతో గాయపడ్డాడు. దీంతో స్థానికులు హుటాహుటిన నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు.
[zombify_post]