in ,

ఎమ్మెల్యే సండ్ర.. ఎన్నికల శంఖారావం…

నాలుగు గోడల మధ్య కూర్చునే ఎమ్మెల్యేను కాదు అంటూ ఓటర్లలో చైతన్యం..

నియోజవర్గంలో 70 శాతం కుటుంబాలకు లబ్ధి చేకూరిందని కితాబ్..

ఓటు అడిగే హక్కు నాకే ఉందంటూ ఉద్బోధ…

ఈ నాలుగేళ్లలో గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని రూపాయితో సహా వివరించిన ఎమ్మెల్యే..

కత్తులు కడుపులో పెట్టుకొని కలుస్తున్న నేతలు అంటూ తుమ్మల పొంగులేటి పై ధ్వజం..

మొదటి రోజు 10 పంచాయతీల్లో విస్తృత పర్యటన..

సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య సోమవారం ఎన్నికల శంఖారావం పూరించారు. మరీ వాస్తు చూసుకొని నియోజకవర్గానికి ఈశాన్య గ్రామం రామానగరం నుంచి తన పర్యటన ప్రారంభించారు. ప్రతి ఎన్నికల్లోనూ ఇక్కడి నుంచి తన ప్రచారం ప్రారంభించడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. మొదటి రోజున సత్తుపల్లి మండలంలోని మొత్తం పది గ్రామ పంచాయతీల్లో ఆయన ప్రచారం పూర్తి చేశారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. కొత్తగా మంజూరైన పనులకు  శంకుస్థాపన జరిపారు. ఎమ్మెల్యే ఎన్నికల శంఖారావం సందర్భంగా ప్రతి గ్రామంలోనూ ఆయన్ను కార్యకర్తలు పూలతో స్వాగతం పలికారు. గృహలక్ష్మి, వృద్ధాప్య పింఛన్, రైతుబంధు తదితర సమస్యలకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులను అక్కడికక్కడే ఆయన పరిష్కరించారు.ఈ సందర్భంగా సాగిన సభల్లో  మాట్లాడుతూ మూడు పర్యాయాలు ఆశీర్వదించిన సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. నాలుగు గోడల మధ్య ఉండే ఎమ్మెల్యేను కాదని, ప్రజల కోసం చెట్టు కింద కూర్చొని ప్రతి వ్యక్తిని పలకరించే మనస్తత్వం ఉన్నవాడినన్నారు, తాను పేదరికం నుంచి వచ్చాను కాబట్టే, పేదల సమస్యల గురించి పూర్తి స్థాయిలో తనకు అవగాహన ఉందన్నారు. ప్రతిపక్షంలో కొనసాగటం వల్ల నియోజవర్గం అభివృద్ధిలో కుంటు పడుతుందనే విషయం గ్రహించి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ లో చేరడం జరిగిందని వివరణ ఇచ్చారు. ప్రభుత్వంలో ఉన్న ప్రతి పథకం సత్తుపల్లి తెచ్చానన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గానికి వెళ్లిన ప్రతి పథకం సత్తుపల్లి వచ్చిందన్నారు. కులం, మతం, మధ్యవర్తులు లేని సేవలు అందిస్తున్నట్లుగా తెలిపారు. ప్రతి గ్రామంలోనూ వంద శాతం రోడ్లు పూర్తి చేశామన్నారు. సత్తుపల్లిలో రూ 34 కోట్లతో 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 30న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో 22 పల్లె దవాఖానాలు తెచ్చానన్నారు.. ఒక్క సత్తుపల్లి నియోజకవర్గానికి  నాలుగు సంవత్సరాలలో రూ.27 కోట్ల సీఎంఆర్ఎఫ్ సహాయం అందజేశామన్నారు. వచ్చిన ప్రతి దరఖాస్తు పరిశీలించి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, రైతు బీమా సేవలు అందించామన్నారు. ఎక్కడా రాజకీయ పక్షపాతం చూపించలేదన్నారు. కుల మతాల తారతమ్యం లేకుండా సేవలు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తనతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ ను తిరిగి అధికారంలోకి తీసుకురావాలని కోరారు. కొంతమంది కడుపులో కత్తులతో కలుసుకొని తిరుగుతున్నారని, వాళ్లతో ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం ఉండదని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు,మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మోసం మాటలు నమ్మకుండా తిరిగి కారు గుర్తును అధికారంలోకి తీసుకురావాలని కోరారు.కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మ చైర్మన్ వనమా వాసు, ఎంపీపీ దొడ్డ హైమావతి శంకర్రావు, జడ్పిటిసి సభ్యులు కూసం పూడి రామారావు, శీలపు రెడ్డి  హరికృష్ణ రెడ్డి, యాగంటి శ్రీనివాసరావు, మందపాటి శ్రీనివాసరెడ్డి, తుంబూరు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

modi

‘వాట్సాప్ ఛానెల్’లో మాట్లాడుకుందాం’ – మోదీ

తాగునీరు రావడం లేదని ధర్నా