పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ని శనివారం ఉదయం పాడేరు పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ఉదయం తన నివాసానికి వెళ్లిన పోలీసులు ఆమెను కారులో స్టేషన్ కు తరలించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు నేపధ్యంలో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త గా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరోవొపు ఆర్టీసీ అధికారులు బస్సులను రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుల్లు పడుతున్నారు.
[zombify_post]