in , ,

కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న హోంమంత్రి

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గ అమ్మవారిని రాష్ట్ర హోమం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత గురువారం దర్శించుకున్నారు. అమ్మవారి సన్నిధిలో హోంమంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు,  ఈఓ భ్రమరంభ అమ్మవారి తీర్థ ప్రసాదం పట్టు వస్త్రాలను అందజేశారు. ఆలయ మర్యాదలతో హోంమంత్రికి ఘన స్వాగతం పలికారు. హోం మంత్రితో పాటు కొవ్వూరు మున్సిపాలిటీ మహిళా కౌన్సిలర్లు, పశ్చిమ గోదావరి జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్, నాయకులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్య్రమంలో విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి,  డిప్యూటీ మేయర్లు అవుతు శైలజా రెడ్డి, బెల్లం దుర్గ పాల్గోన్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

రేపు అకౌంట్లోకి రూ.10వేలు

పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ