-
బోధన సామాగ్రితో మెరుగైన విద్యా బోధన.
-
జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావ్.
ప్రభుత్వ పాఠశాలలో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధన అందాలని విద్యా శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావ్ ఆదేశించారు. బుధవారం కాలెక్టరేట్ లో విద్యా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోధన అభ్యసన సామగ్రి ప్రదర్శన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావ్ పాల్గొని తిలకించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో సమర్థవంతమైన విద్యకోసం లర్నింగ్ మెటీరియల్ విద్యార్థులకు ఎంతో ఉపయోగదాయకంగా ఉంటుందని అన్నారు.బుధవారం ప్రదర్శించిన 21 రకాల బోధన సామగ్రి లో 8 ఇంటి ని ఎంపిక చేసి యడ్ క్రాప్ట్ ఏజెన్సీ ద్వారా ఎంపిక చేసిన బోధన సామాగ్రిని వారి ద్వారా తయారు చేయించి జిల్లాలోని ఇంగ్లీష్, తెలుగు మీడియం ప్రభుత్వ పాఠశాలాలకు అందించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇట్టి కార్యక్రమాల ద్వారా సృజనాత్మకతతో పాటు మేదో శక్తి ఎంతో పెరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.జిల్లా స్థాయిలో ఎంపిక కాబడిన బోధన సామాగ్రి తయారుచేసిన ఉపాధ్యాయులను కలెక్టర్ అభినందించారు వీరికి 17 తారీఖున తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం రోజున రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి చేతులు మీదుగా ఉపాధ్యాయులకు సన్మానం తోపాటుగా నగదు బహుమతి అందజేయనున్నారు.ఈ కార్యక్రమంలో జెడ్.పి. సి.ఈ. ఓ సురేష్, డి.ఈ. ఓ అశోక్, పీడీ. ఐసిడిఎస్ జ్యోతి పద్మ,డిటీడీఓ శంకర్,రితికా ఆగర్వాల్,రాజిక, ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]