సత్తుపల్లి క్లిష్టారం ఉపరితల గని లో కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ షాలేం రాజు బ్లాస్టింగ్ ఆపరేషన్స్ ను ఆకస్మిక తనిఖీ చేసినారు. బ్లాస్టింగ్ ఆపరేషన్స్ లో శబ్దము మరియు వైబ్రేషన్ రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురుంచి కిష్టారం ఓసి అధికారులకు వివరించారు. ముఖ్యముగా ప్రతి బ్లాస్టింగ్ ఫేస్ కు సరియగు విధముగా ప్రీ ఫేస్ ఉండాలని వివరించటం జరిగింది. తదనంతరం పని స్థలాలు తనిఖీ చేసి రక్షణ పరంగా, ముఖ్యముగా హల్ రోడ్స్ లో సాండ్ రంపులు చేయాలనీ మరియు నాణ్యత పరంగా తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎం.వి. నరసింహారావుకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం జనరల్ మేనేజర్ షాలేము రాజు, కిష్టారం ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎం.వి. నరసింహారావు, మేనేజర్ రామకృష్ణ, బ్లాస్టింగ్ ఇంచార్జి గోపి కిషోర్, క్వాలిటీ ఇంచార్జి శ్రీ సురేష్, కొత్తగూడెం ఏరియా సెక్యూరిటీ అధికారి రమణ రెడ్డి, జనరల్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ వి.బాబు, ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
[zombify_post]