సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో పర్యటించిన మున్సిపల్ చైర్ పర్సన్ కూసంపూడి మహేష్ డ్రై డే కార్యక్రమంతో పాటు సీజనల్ వ్యాధులపై అవగాహన నిర్వహించారు. వార్డులలో, ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి సీజనల్ జ్వరాల పై అవగాహన కల్పించారు. వార్డులో డెంగ్యూ కేసులు నమోదు కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మెడికల్ సిబ్బందిని ఆదేశించారు. వార్డులో అపరిశుద్ధ్యం ఉండకూడదని, పారిశుద్ధ్యం మెరుగు పర్చాలని శానిటేషన్ అధికారులకు ఆదేశించారు. తడి చెత్త, పొడి చెత్త వేరు చేసెల ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే డ్రై డే ప్రై డే కార్యక్రమంలో భాగంగా ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు ఉండకూడదని నిల్వలు వల్ల దోమలు వ్యాప్తి చెంది జ్వరాల బారిన పడతారని హెచ్చరించారు. అనంతరం దోమల వ్యాప్తి అరికట్టడానికి అవగాహన కల్పించారు. ఆయన వెంట కమీషనర్ కే.సుజాత, గంగారం పీహెచ్ సి అవినాష్, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
[zombify_post]