ద్విచక్ర వాహనం బోల్తా ఒకరికి తీవ్ర గాయాలు టెక్కలి లోని చేరివీధి సమీపంలోని గురువారం ద్విచక్రవాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సంతబొమ్మాలి మండలం కాశీపురం గ్రామానికి చెందిన బసవల రాము అనే వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి. ద్విచక్రవాహనంపై అయోద్యపురం గ్రామానికి వెళ్తున్న క్రమంలో నాలుగురోడ్ల కూడలి వద్ద వాహనానికి కుక్క అడ్డంగా రావడంతో ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు.
[zombify_post]