- జీవీఎంసీ కార్పొరేటర్లు ఈ నెల 10 నుంచి అధ్యయన యాత్ర చేపట్టనున్నారు. అమృత్సర్, శ్రీనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్న అభివృద్ధి, స్వచ్ఛభార నీళ్ళుత్ కార్యక్రమాలు, తాగు మురుగునీటి వ్యవస్థల నిర్వహణపై అధ్యయనం చేయనున్నారు. అమృత్సర్, శ్రీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం కానున్నారు. అలాగే పెహల్గం, డాల్లేక్ బోటింగ్, సోనామార్గ్, జోజిల్లా, జీరో పాయింట్, తాజ్ వాస్, కాత్రా, మాతా వైష్ణోదేవి టెంపుల్, గోల్డెన్ టెంపుల్, జలియన్ వాలా బాగ్, ఇండో–పాక్ వార్ బోర్డర్ తదితర ప్రాంతాల్లో పర్యటిస్తారు.
ఈ నెల 10న ఇక్కడి నుంచి బయలుదేరినెల 10న ఇక్కడి నుంచి బయలుదేరి.. అదే రోజు సాయంత్రం 4 గంటలకు శ్రీనగర్ చేరుకుంటారు. 11న శ్రీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ను సందర్శిస్తారు. 12న శ్రీనగర్ నుంచి బయలుదేరి జోజిల్లా, జీరోపాయింట్, తాజ్వాస్ సందర్శించి అక్కడ అభివృద్ధి పనులు పరిశీలిస్తారు. 13న రోడ్డు మార్గంలో కాత్రా చేరుకుంటారు. 14న కాత్రాలో మాతా వైష్ణోదేవి టెంపుల్, 15న అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్, జలియన్వాలాబాగ్, ఇండో–పాక్ బోర్డర్ను సందర్శిస్తారు. 16న అమృత్సర్ మున్సిపల్ కార్పొరేషన్ను సందర్శించిన అనంతరం ఢిల్లీ చేరుకుంటారు. అక్కడ వ్యక్తిగత పనులు చూసుకుని.. అనంతరం విశాఖ రానున్నారు.
[zombify_post]
