సిరివెళ్ల మండల పరిధిలోని కర్నూలు కడప జాతీయ రహదారి సమీపంలో సిరివెళ్ల మెట్ట సమీపంలో యూనియన్ బ్యాంక్ రూ.50 కోట్ల టన్న్వో ర్ బిజినెస్ కావడం జరిగిందని
బ్యాంకు మేనేజర్ అనూష తెలిపారు.ఈ సందర్భంగా బ్యాంకు వినియోగదారుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎంపీడీవో సుబ్రమణ్యంపాల్గొని అధ్యక్షత వహించారు.అనంత రం ఎంపీడీవో సుబ్రహ్మణ్యం వినియోగదారుల సమావేశం
లో మాట్లాడుతూ బ్యాంకు ద్వారా వినియోగదారులందరికీ సేవలు అందించడం జరుగు తుందిని అన్నారు. అప్పుడే బ్యాంకు అభివృద్ధి బాటలో పయని స్తుందని తెలియ జేశారు.అనంతరం బ్యాంకు వినియోగదారులు కోటపాడు దూదేకుల గురప్ప మాట్లాడుతూ బ్యాంకు సేవలను గుర్తించి బ్యాంకు అభివృద్ధికి పాటుపడాలని కోరారు. బ్యాంకు ద్వారా వినియోగదారులకు అన్ని రకాల పథకాలతో పాటు బ్యాంకు సేవలను అందించడం జరుగుతుంది అని బ్యాంకు మేనేజర్ అనూష తెలిపారు. బిజినెస్ సేకరణతో పాటు వినియోగదారులకు గోల్డ్ లోను, పంట రుణాలు, పర్సనల్ లోను, వెహికల్ లోను వ్యాపారస్తులకు లోన్లు తదితర లోను సౌకర్యం కల్పించడం జరుగుతుందిని అన్నారు. వినియోగదారులు తీసుకున్న లోన్లను సకాలంలో చెల్లించి న వారికి యధాప్రకారం తిరిగి లోన్లను వినియోగదారులకు ఇవ్వడం జరుగుతుందిని బ్యాంకు మేనేజర్ అనూష తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ పద్మజ, క్యాషియర్ రమేష్ ఈశ్వరయ్య సిబ్బంది, వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]