in , , ,

పక్కా స్కెచ్ కోటి 40. లక్షలు దోపిడి

విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కొర్లాం గ్రామంలో బ్యాంకు ఎ.టి.ఎం.లలో నగదు పెట్టే ఏజన్సీనుండి రూ. కోటి 40 లక్షలను గత నెల 23న దోచేసిన కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసి, వారి నుండి రూ. 80లక్షలు రికవరీ చేసినట్లుగా ఆగస్టు 5న జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలోజిల్లా ఎస్పీ ఎం.దీపిక, ఐపిఎస్ వివరాలను వెల్లడించారు.  మీడియాతో మాట్లాడుతూ – 'సెక్యూర్ వాల్యూ ఇండియా లిమిటెడ్' అనే కంపెనీ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఏక్సిస్ బ్యాంకు వంటి జాతీయ బ్యాంకులకు చెందిన ఎ.టి.ఎం. కేంద్రాల్లో క్యాష్ నుపెడుతుంటారన్నారు. ఈ కంపెనీలో కస్టోడియన్ గా వ్యవహరిస్తున్న 4గురు వ్యక్తులు ఆగస్టు 23న రూ.1.40 కోట్లును తీసుకొని, రూట్ నంబరు 3 మరియు 4 లోగల ఎ.టి.ఎం. కేంద్రాల్లో జమ చేసేందుకు బయలుదేరి, కుమిలి
గ్రామంలోగల ఇండియా 1 ఎ.టి.ఎం. కేంద్రంలో రూ. 4 లక్షలు జమ చేసి, మిగిలిన రూ.1.36 కోట్ల నగదుకు ఎటువంటి నివేదిక ఇవ్వకపోవడంతో బ్యాంకు అధికారులు అనుమానం వచ్చి ఆగస్టు 24 నుండి 26 వరకు క్యాష్ ఆడిట్ నిర్వహించి, సుమారు రూ.1,42,27,900/-ల నగదు పోయినట్లుగా గుర్తించి, గంట్యాడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గంట్యాడ పోలీసులు కేసు నమోదు చేసి, 'సెక్యూర్ వాల్యూ ఇండియా లిమిటెడ్' కంపెనీలో కస్టోడియన్స్ గా
పని చేస్తున్న 4గురిని అరెస్టు చేసారు. విచారణలో కస్టోడియన్స్ (నిందితులు) 70:100 నిష్పత్తిలో రూ.2 కోట్ల రూ. 2 వేలు నోట్లు తీసుకొని, రూ.1.40 కోట్ల రూ.500ల నోట్లును వేరే వ్యక్తులకు ఇచ్చి, వారి వద్ద నుండి రూ.60 లక్షలు కమీషనుగా పొందాలని భావించినట్లుగా వెల్లడయ్యిందన్నారు. నిందితులు వేసుకున్న పథకంలో భాగంగా ఆగస్టు 23న
రెండు బ్యాగుల్లో రూ. 1.40 కోట్లను కస్టోడియన్గా వ్యవహరిస్తున్న నలుగురు నిందితులు గంట్యాడ మండలం కొర్లాం గ్రామ శివార్లకు మోటారు సైకిళ్ళుపై వెళ్ళగా, అక్కడకు వచ్చిన నిందితులు (ఎ-6) సాలూరు మండలం మరుపల్లికి
చెందిన రాయపల్లి వినోద్ (ఎ-8) రణస్థలం మండలం బోయపాలెంకు చెందినబోయ గోవింద రావు (ఎ-9) పార్వతీపురం పట్టణంకు చెందిన అలజంగి సాయి అలియాస్ టాట్టూ సాయి (ఎ-10) విజయనగరం పట్టణం బాబామెట్టకు
చెందిన నక్క సంతోష్ (ఎ-11) పార్వతీపురం పట్టణంకు చెందిన మరడ శివశంకర్ అనే ఐదుగురు వ్యక్తులు వచ్చి,సెక్యూర్ వాల్యూ ఇండియా లిమిటెడ్ కస్టోడియన్స్ నలుగురిని కొట్టి, వారి వద్ద ఉన్న రూ.1.40 కోట్ల నగదును
దోచుకొని పరారైనట్లుగా విచారణలో వెల్లడయ్యిందన్నారు. ఈ కేసును తీవ్రంగా పరిగణించిన పోలీసులు జిల్లా ఎస్పీగారి
ఆదేశాలతో విజయనగరం రూరల్ సిఐ టివి తిరుపతిరావు, సిసిఎస్ సిఐ ఎం. బుచ్చిరాజు ఆధ్వర్యంలో పోలీసు బృందాలురూ.1.40 కోట్లను దోచుకొనిపోయిన నిందితుల గురించి తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టి, దోపిడికి పాల్పడిన 5గురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుండి రూ.80 లక్షల నగదును, ఒక బంగారు గొలుసు, మూడు సెల్ ఫోన్లు,
మూడు బైకులను స్వాధీనం చేసుకున్నారని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురు కస్టోడిన్స్,దోపిడికి పాల్పడిన ఐదుగురు నిందితులను అరెస్టు చేసామన్నారు. ఇంకనూ వీరికి సహకరించిన మరికొంతమంది నిందితులు కూడా ఉన్నట్లుగా దర్యాప్తులో వెల్లడయ్యిందని, వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని జిల్లా ఎస్పీ ఎం. దీపిక తెలిపారు.
ఈ కేసులో క్రియాశీలకంగా పని చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. వీరందరికి
త్వరలో ప్రోత్సాహక బహుమతులను అందజేస్తామన్నారు. ప్రజలు మోసగాళ్ళ ఉచ్చులో పడవద్దని, నిబంధనల మేరకు
రూ.2000/- ల నోట్లను బ్యాంకుల్లోనే మార్చుకోవాలని ప్రజలకు జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేసారు. రూ. 2000/-ల నోట్లును
మార్పిడి పేరుతో మోసాలకు పాల్పడుతున్న మోసగాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇటువంటి వ్యక్తుల సమాచారం
ఏదైనా ఉంటే స్థానిక పోలీసులకు అందించాలని జిల్లా ఎస్పీ ఎం.దీపిక ప్రజలకు విజ్ఞప్తి చేసారు.జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో విజయనగరం ఇన్చార్జ్ డిఎస్పీ
ఆర్. శ్రీనివాసరావు, విజయనగరం రూరల్ సిఐ టి.వి. తిరుపతిరావు, సి.సి.ఎస్., సిఐ ఎం. బుచ్చిరాజు, ఎస్బి సిఐలు కే.కే.వి.విజయనాధ్, ఈ.నర్సింహ మూర్తి, ఎస్ఐలు కిరణ్
కుమార్ నాయుడు, గణేష్, సాగర్బాబు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

ఘనంగా మజ్జి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు

120 మందికి నేత్ర వైద్య పరీక్షలు