in , ,

5,511 మీటర్ల ఎత్తు లో జాతీయ జెండా -ఆర్మీ కల్నల్ రనవిర్ సింగ్ జంవల్

అల్లూరి జిల్లా: హుకుంపేట మండలం లోని తీగల వలస పంచాయతీ లో ఉన్న సీతమ్మ పర్వతం వద్ద సోమవారం హర్ శిఖర్ తిరంగా కార్యక్రమం ఘనంగా జరిగింది, ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా భారత ఆర్మీ కల్నల్ రనవీర్ సింగ్ జంవల్ పాల్గొన్నారు, వీరికి ఓలు బిడ్డ గిరిజన ప్రజలు గిరిజన సంప్రదాయ పద్ధతి లో ఘన స్వాగతం పలికారు, అనంతరం హర్ శిఖర్ తీరంగా కార్యక్రమం లో పాల్గొవడానికి విచ్చేసిన ఆర్మీ సిబ్బంది స్థానిక గిరిజన మహిళలతో కలిసి దింశా నృత్యం చేసి, సీతమ్మ కొండ కు చేరుకొని జాతీయ జెండా ను ఎగురవేసి గౌరవ వందనం చేశారు, అనంతరం ఆర్మీ కల్నాల్ రనవీర్ సింగ్ జంవల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఉన్న అతి ఎత్తయినా పర్వతాల పై జాతీయ జెండా ను ఎగుర వేసి గౌరవ వందనం చేస్తున్నామనీ, దీని వలన ప్రజల్లో ఐక్యత, జాతీయ భావాలు పెరుగుతాయనీ పేర్కొన్నారు, ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగుర వేసినట్లే ప్రతి కొండ పై జాతీయ జెండా వేసేదే ఈ హర్ శిఖర్ తిరంగా కార్యక్రమం అని అన్నారు, ఇప్పటి వరకు 22 రెండు రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం నిర్వహించామని,అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో కూడా సముద్ర మట్టానికి 5,511 మీటర్ల ఎత్తులో ఉన్న సీతమ్మ పర్వతం పై నేడు జాతీయ జెండా ఎగుర వేయడం గర్వంగా ఉందని పేర్కొన్నారు, అలాగే స్థానిక గిరిజన ప్రజల ఆత్మీయ స్వాగతం తాము ఎన్నడూ మరిచి పోలేమన్నారు, ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేసిన రాష్ట్ర ప్రభుత్వానికీ,అటవీ, రెవిన్యూ, పోలీస్ శాఖ వారికీ ధన్యవాదములు తెలుపుతున్నామన్నారు, ఈ కార్యక్రమం లో గతం లో ఎవరెస్ట్ అధిరోహించిన సందన పల్లి ఆనంద్,స్థానిక సర్పంచ్ పాంగి బెసు,బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పాంగి మత్స్య కొండ బాబు, ఏబీవీపీ రాష్ట్ర గిరిజన విద్యార్థులకన్వినర్ అంగనైని ఆనంద్, స్థానిక యువత సంతోష్, సద్దు, ప్రవీణ్, పల్లి బోయిన ఆనంద్,సాయికుమార్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

ప్రజావాణి కార్యక్రమానికి 145 ఫిర్యాదులు – జిల్లా కలెక్టర్ డాః బి. గోపి

మనోదైర్యం కల్పించేలా ప్రభుత్వ సంక్షేమ పథకాలు -గంగుల కమలాకర్