మందస మండలం అంబుగాం బొడ్లూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యాశాఖ అధికారులు సోమవారం దర్యాప్తు చేపట్టారు.పాఠశాలలో ఉపాధ్యాయుడు పై జిల్లా విద్యాశాఖ అధికారికి అందిన ఫిర్యాదు మేరకు ఉప విద్యాశాఖ అధికారి పగడాలమ్మ దర్యాప్తు చేపట్టి పలు వివరాలు సేకరించారు.రికార్డులను పరిశీలించారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తానని తెలిపారు. ఈమె వెంట మందస మండల విద్యాశాఖ అధికారి ఎం. లక్ష్మణరావు తదితరులు ఉన్నారు.
