డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం ఊబలంక గ్రామంలో జైభీమ్ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో బహుజన సమాజ్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సాకా రాజారావు కొత్తపేట నియోజకవర్గ అధ్యక్షులు గుర్రపు కొత్తియ్య ఓటు హక్కు గురించి,రాజ్యాధికారం గురించి,ఓటు శాతం గురించి తెలియజేశారు.అక్కడ వున్న ప్రజలు మనకు రాజ్యాధికారం కావాలి అనే ఆలోచనతో కోరం రాము, కొత్తపల్లి రాజు, పట్నాల రాజశేఖర్, ఇసుకపట్ల నందేష్ కాయల డేవిడ్ బహుజన సమాజ పార్టీ లో చేరారు.వీరందరూ బహుజన రాజ్యాధికారం కోసం ప్రయత్నాలు చేద్దాం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు గ్రామ పెద్దలు,మహిళలు, యువత తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!