టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, ప్రముఖ అడ్వకేట్ ముప్పాళ్ల సుబ్బారావు పరామర్శించారు. చంద్రబాబు అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తూ మనో ధైర్యంతో ఉండాలని లోకేష్ కు సూచించారు.ఈ సందర్బంగా రామకృష్ణ మాట్లాడుతూ.రాష్ట్రంలో ఒక నియంతతో ప్రతిపక్షాలు, ప్రజలు పోరాడుతున్నారని అన్నారు.జగన్ ప్రజాస్వామ్యాన్ని, ప్రజల తరపున పోరాడుతున్న వారి గొంతు నొక్కుతున్నారని అన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా చంద్రబాబునాయుడు ఏనాడు వీధి రాజకీయాలు చేయలేదన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కు ప్రజలు గుణపాఠం చెప్తారని అన్నారు.చంద్రబాబు మంచి తనమే ఆయన్ని కాపాడుతుందన్నారు.రామకృష్ణ, నాగేశ్వరావు, సుబ్బారావుకు లోకేష్ ధన్యవాదాలు తెలిపారు
[zombify_post]