గురు, గురు న్యూస్ విశాఖపట్నం : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ కి నిరసన గా విశాఖపట్నం రామకృష్ణ బీచ్ లో టీడీపీ మహిళా రాష్ట్ర కార్యదర్శి వంగళపూడి అనిత ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు .శాంతియుతంగా నిర్వహించబోయిన నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకొని మహిళలు అందర్నీ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. ఈ సందర్బంగా అనిత మాట్లాడుతూ ప్రజాస్వామ్య విధానాలు పై అవగాహన లేని వ్యక్తి పాలకుడు గా ఉంటే ఇలాంటి నిరంకుశ నిర్ణయాలతోనే ప్రజలను ఇబ్బంది పెడతారు అనడానికి ఈ అక్రమ నిర్భందమే ఉదాహరణ అని ఆమె అన్నారు. మహిళల పట్ల ఈ ప్రభుత్వం నిరంకుశం గా వ్యవహారిస్తుంది అని ఆమె అన్నారు. చంద్రబాబు గారిని విడుదల చెయ్యాలని ఆమె కోరారు.
This post was created with our nice and easy submission form. Create your post!