మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను నిరసిస్తూ రాజోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి తాడి మోహన్ బాబు రాజోలు తాసీల్ధార్ బొంతు ముక్తేశ్వరరావుకు మెమోరాండం ఇచ్చారు. ఈ మేరకు తాడి మోహన్ బాబు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అక్రమంగా కేసులు బనాయించి అరెస్ట్ చేయ్యడమనేది రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు నిదర్శనమన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ ప్రజలు నిరసన కార్యక్రమాలు చేబడుతుంటే పోలీస్ వారి చేత నిరసన కార్యక్రమాలు చేపట్టకుండా పలు సెక్షన్ల జారీ చేయ్యడం ప్రజాస్వామ్య విలువలను తుంగలోకి తొక్కుతున్నట్లు అర్ధంమౌతుందని తాడి మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై రాజోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ తీవ్రంగా ఖండిస్తుందని, మెమోరాండంలోనున్న విష్యాలన్నింటిని రాష్ట్ర గవర్నర్ దృష్టికి పై అధికారుల ద్వారా తీసుకెళ్లాల్సిందిగా తాసీల్ధార్ ముక్తేశ్వరరావును కోరినట్లు తాడి మోహన్ బాబు తెలిపారు. గురువారం రాజోలు నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కు నిరసనగా జరుగుతున్న రిలే నిరాహారదీక్ష కార్యక్రమంలో ఎస్సీ వర్గాలుకు చెందిన నాయకులు దీక్షలో కూర్చుంటారని ఈ సందర్భంగా తాడి మోహన్ బాబు తెలిపారు.
[zombify_post]