ఆదోని న్యూస్ :- యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి టీ. గాదిలింగప్ప, యుటిఎఫ్ ఆదోని రూరల్ అధ్యక్షులు వై. రామాంజనేయులు, యుటీఎఫ్ ఆవిర్భవించి (ఆగస్టు 10,1974) ఆగస్టు10, 2023 నాటికి 49సంవత్సరాలు పూర్తి చేసుకుని 50వ వసంతంలోకి ప్రవేశించిన సందర్భంగా స్వర్ణోత్సవ సంబరాలు ఆగస్టు 10, 2024 వరకు జరుగుతాయి. ఈ సందర్భంగా విజయవాడలో 01 అక్టోబర్ 2023 న ప్రారంభయ్యే స్వర్ణోత్సవ ప్రారంభ వేడుకలకు రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణోత్సవ ప్రచార యాత్ర (జాతా) రెండు ప్రాంతాల్లో ఈనెల21న బైక్ యాత్ర ప్రారంభం అవుతాయి. హిందూపురంలో 21ప్రారంభమైన బైకు ప్రచార (జాతా) యాత్ర 22న కర్నూలు జిల్లా పత్తికొండలో ఉదయం ప్రారంభమై కోడుమూరు, కర్నూలు కేంద్రాలలో జరుగుతుంది కనుక 22వ తేది కర్నూలు జిల్లాలో జరిగే స్వర్ణోత్సవాల ప్రచార యాత్ర (జాతా)లో ఉపాధ్యాయులు యుటిఎఫ్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి టీ. గాదిలింగప్ప, యుటిఎఫ్ ఆదోని రూరల్ అధ్యక్షులు వై రామాంజనేయులు కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు ఎస్ లింగన్న వై ఉరుకుందయ్య,ఉపాధ్యాయులు లక్ష్మి నారాయన , జానాకి, సరస్వథి, ఛ్హెన్నయ్య, పాల్గొన్నారు.
[zombify_post]