in , , ,

సాయుధ పోరాటంలో యోధుల త్యాగం మరువలేనిది: మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి

  • సాయుధ పోరాటం లో యోధుల త్యాగం మరువలేనిది

  • వారి త్యాగాలను తలచుకోవడం మనందరి కర్తవ్యం

  • అమరుల ఆశయాలకు అనుగుణంగా కేసీఆర్ పాలన

  • గంగా జమున తేహజీబ్ సంస్కృతి కి నిలయం తెలంగాణ

  • అన్ని రంగాల్లో అద్భుతాలు ఆవిష్కరించి దేశానికే దిశా నిర్దేశం చేస్తున్న రాష్ట్రం తెలంగాణ

➖➖➖➖➖➖➖➖➖➖

  • సూర్యాపేట లో ఘనంగా జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు

  • కలెక్టరేట్ ప్రాంగణం లో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన  రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి

➖➖➖➖➖➖➖➖➖

  • సూర్యాపేట

తెలంగాణ సాయుధ పోరాటం లో యోధుల త్యాగం మరువలేనిదని  రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి  గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. 

సూర్యాపేటలో జాతీయ సమైక్యతా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం సాయుధ పోరాట యోధులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి, భూస్వామ్య , రాచరికపు వ్యవస్థను రూపుమాపి అమరులైన పోరాట యోధుల వీరత్వాన్ని మంత్రి  కొనియాడారు. చాకలి ఐలమ్మ చైతన్యంతో మొదలై.. దొడ్డి కొమురయ్య అమరత్వంతో  ఉవ్వెత్తున  లేచిన సాయుధ పోరాటం  ప్రపంచం లోనే తెలంగాణ పేరును మారుమ్రోగెలా చేసి చరిత్రలో నిలిచిందన్నారు.

హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో విలీనం కావడంతో తెలంగాణలో రాచరికం ముగిసిపోయి పార్లమెంటరీ ప్రజాస్వామ్య పరిపాలన ప్రారంభమైందన్నారు. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో అంతర్భాగంగా మారిన ఈ సందర్భాన్ని జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుకోవడం సముచితమని ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో ని బీఆర్ఎస్ ప్రభుత్వం భావించిందన్నారు.

దేశంలో గంగ.. జమున.. తేహజీభ్ గా పేరొందిన తెలంగాణ లో ఆ సంస్కృతి  కొనసాగి తీరుతాదని మంత్రి అన్నారు.  ఎవరు ఎన్ని కుట్రలు చేసినా,కేసియర్ నాయకత్వం లో  కుట్రలను తిప్పి కొట్టే చైతన్యం తెలంగాణ  ప్రజలకు ఉందన్నారు. 

1956లో దేశంలో జరిగిన రాష్ట్రాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా, తెలంగాణ ప్రజల మనోబిష్టానికి వ్యతిరేకంగా తెలంగాణ – ఆంధ్రను కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన దశాబ్ద కాలంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం ఎగిసి పడిందన్నారు. సమస్యను పరిష్కరించాల్సిన ఆనాటి కేంద్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా  సాచివేత ధోరణి అవలంబించింది అన్నారు. 

తెలంగాణ ప్రజల న్యాయమైన ఆకాంక్షను పట్టించుకోకుండా గాలికి వదిలేసిందన్నారు. తెలంగాణ ప్రజలు భయపడినట్లుగానే సమైక్య రాష్ట్రంలో అన్ని రంగాల్లో దారుణమైన వివక్ష అమలైంది అన్నారు. ఈ క్రమంలోనే ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్ష క్రమేపీ బలపడుతూ వచ్చింది అన్నారు.

2001లో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సారథ్యం వహించి పూరించిన ఉద్యమ శంఖం 14 ఏళ్ల అవిశ్రాంత పోరాటం అనంతరం ఆశించిన గమ్యాన్ని ముద్దాడిందన్నారు. 2014 జూన్ 2న తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నం సాకారం అయిందన్నారు. ఆనాటి నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో విద్యుత్, తాగు, సాగునీరు ,వ్యవసాయం, ప్రజా సంక్షేమం ,పారిశ్రామిక  రంగాలలో ఆనతి కాలంలోనే తెలంగాణ అద్భుతాలను ఆవిష్కరించి దేశానికే దిశా నిర్దేశం చేస్తున్నది అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అవలంబించిన ప్రగతిశీల పారదర్శక విధానాల వల్ల సూర్యాపేట జిల్లా అభివృద్ధిలో  ముందంజలో ఉందన్నారు.

సూర్యాపేట జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో సిరి సంపదలతో సౌభాగ్యాలతో విలసిల్లాలని అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని మంత్రి జగదీష్ రెడ్డి ఆకాంక్షించారు. సూర్యాపేట జిల్లా ప్రజలకు తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం మంత్రి పోరాట యోధుల కుటుంబాలను, స్వాతంత్ర సమరయోధులను, అమరవీరుల కుటుంబాలను ఘనంగా సన్మానించారు. నాటి పోరాట వీరుల త్యాగాలను స్మరించుకున్నారు.జిల్లాలో  ఉత్తమంగా నిలిచిన గ్రామ పంచాయ‌తీల స‌ర్పంచ్ లు, గ్రామ కార్యదర్శులను అభినందించారు.

వారి ప‌నితీరు వ‌ల్లే ఈ అవార్డులు ద‌క్కాయ‌న్నారు. వికలాంగులకు బ్యాటరీ ఆధారిత సైకిళ్ళ ను , అంగన్ వాడి లకు వంట సామాగ్రి, గణేష్ చవితి నేపథ్య లో మట్టి గణపతులను పంపిణీ చేయడం తో పాటు పలు సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్నారు..

[zombify_post]

Report

What do you think?

విశ్వకర్మ భగవాన్ జయంతి హాజరైనా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ పవార్ రామారావు పటేల్

*బాధిత కుటుంబనీకి పరామర్శ…*