ఆదోనిలోని ప్రసిద్ధ గాంచిన రణమండల కొండ మీద వెలసిన ఆంజనేయ స్వామికీ ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మాజీ ఇంచార్జ్ గుడిసె అది కృష్ణమ్మ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించినారు. వైసిపి బెదిరింపులకు భయపడేది లేదు , టిడిపి జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్టును నిరసిస్తూ చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్యంగా ధైర్యంగా, ఉండాలని తప్పుడు కేసులు కొట్టివేయలని టిడిపి మాజీ ఇంచార్జ్ శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ ఆధ్వర్యం లో రణమండల కొండ మీద రణమండల ఆంజనేయస్వామికి అభిషేకం మరియు 101 కొబ్బరికాయలు కొట్టడం జరగింది. టిడిపి బీసీ సెల్ మాజీ రాష్ట్ర కార్యదర్శి వడ్డేమాన్ గోపాల్ 501 మెట్లు మోకాళ్ళ మీద ఎక్కడం జరిగింది. అనంతరం వైసీపీ బెదిరింపులు, తప్పుడు కేసులకు భయపడేది లేదని టీడీపీ మాజీ ఇంచార్జ్ గుడిసె అది క్రిష్ణమ్మ వ్యాఖ్యానించారు. మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలను భయపెట్టాలని చూస్తే భయపడం. చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ పేరుతో రూ.3 వేల కోట్లు దోచేశారంటూ వైసీపీతప్పుడు ప్రచారం చేస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కింద సిమెన్స్ కంపెనీ నుంచి ఎక్స్లెన్స్ అవార్డు వస్తే..సీఎం జగన్ ఎలా తీసుకున్నాడని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని గుడిసె అది క్రిష్ణమ్మ స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు గారి పైన అక్రమంగా కేసు పెట్టి అక్రమ అరెస్టు చేసి అబాసపాలైనటువంటి ఇప్పటికైనా తెలుసుకోండి ఏ వ్యక్తి నైనా అరెస్టు చేస్తే వాళ్ల అక్రమాలు బయటకు రావాలి కానీ చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఆయన్ని అరెస్టు చేస్తే ఆయన చేసిన అభివృద్ధి ఈరోజు దేశం దేశం లో ఉండే తెలుగు వాళ్ళు నుంచి అభిమానంగా ఆయన అక్రమ అరెస్టును ఖండిస్తూ ర్యాలీలు ధర్నాలు చేపట్టడం జరిగింది. అక్రమ అరెస్టు చేసినటువంటి నారా చంద్రబాబునాయుడు గారిని వెంటనే విడుదల చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర బీసీ సెల్ ఉపా ఉపాధ్యక్షుడు గుడిసె శ్రీరాములు మాజీ ఎంపీపీ మురళి, జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు గుడిసె రామకృష్ణ, మండగిరి నాయకులు బాబురావు, నాగేంద్ర, కార్వాన్ పేట భరత్ కుమార్, చిరంజీవి, పెద్ద తుంబలం శ్రీనివాస్, నరసప్ప నరసింహులు,, లింగన్న, హనవలు రమేష్ లింగయ్య .రాఘవరెడ్డి, వేమన్న అంజి. మహేంద్ర టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]