నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం – కొలుముల దామోదర్ యాదవ్ ఫౌండేషన్,
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నర్సింగాపూర్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి కొలుముల దామోదర్ యాదవ్ ఫౌండేషన్,ద్వారా గ్రామ సర్పంచ్ సురకంటి శ్రీనివాస్ రెడ్డి, ఆధ్వర్యంలో 5 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. వివరాల్లోకి వెళితే నర్సింగాపూర్ గ్రామానికి చెందిన వడుకప్పురం మల్లేశం, గత కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు మల్లేశం,భార్య రమ,కూతురు మానస లను తన వృత్తి పరంగా మేస్త్రి తాపీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు కుటుంబ ఆర్థిక పరిస్థితి రెక్కాడితే కాని డొక్కనిండని పరిస్థితి కొలుముల దామోదర్ ఫౌండేషన్ ఆర్గనైజేషన్ ఇంచార్జ్ వేల్పుల నాగరాజు కు గ్రామస్తులు ఫోన్ ద్వారా సమాచారం అందివ్వగా వెంటనే స్పందించి కెనడా నుండి కొలుముల దామోదర్ యాదవ్, కుటుంబానికి (5000) వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాలాంటి నిరుపేదలకు సాయం చేస్తూన్నందుకు కులుమల దామోదర్ యాదవ్ ఫౌండేషన్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సురకంటి శ్రీనివాస్ రెడ్డి, చల్ల కుమార్, తోట కొమురయ్య, బద్దం గంగారెడ్డి, మద్దికుంట అంజయ్య, గుండేటి సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు
[zombify_post]
