- యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు న్యాత నవీన్ ఆధ్వర్యంలో దాదాపు 20 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి డిసిసి అధ్యక్షులు ఆది శ్రీనివాస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అదేవిధంగా సనుగుల గ్రామానికి చెందిన గొట్టె నవీన్ ను చందుర్తి మండల యూత్ కాంగ్రెస్ సెక్రెటరీ గా నియమిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సంగితం శ్రీనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరి వెంట జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు భాను , వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దర్మపూరి శ్రీనివాస్, చందుర్తి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలు రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన మండల యూత్ సెక్రెటరీ నవీన్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మల్యాల కృష్ణ, నేరళ్ళ సాగర్, రాము గౌడ్, ప్రశాంత్, బడుగు శశి యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]
