అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలము ఏఎల్ పురం శివాలయం దగ్గర స్థానిక పశు వైద్యురాలు డాక్టర్ శిరీష ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నర్సీపట్నం సహాయ సంచాలకులు డాక్టర్ రాంబాబు మరియు గొలుగొండ, చోద్యం పశువైద్య కేంద్రముల డాక్టర్లు రమేష్, రామ్మోహన్ విచ్చేశారు .ఈ శిబిరంలో 13 గైనిక్ కేసులు,30 జీవాలకు నట్టల నివారణ మరియు ఒక ఎద్దు కు శస్త్ర చికిత్స చేశారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య సహాయకులు మరియు పశువుల అంబులెన్స్ సిబ్బంది పాల్గొన్నారు.
[zombify_post]