లక్కవరపుకోట "
*గొల్జాంలో బాబు ష్యురీటి – భవిష్యత్తుకు గ్యారెంటీ ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్న నియోజవర్గ ఇంఛార్జ్ కోళ్ల లలిత కుమారి*
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు శృంగవరపుకోట నియోజకవర్గంలోని లక్కవరపుకోట మండలం, గొల్జాం గ్రామంలో గల క్లస్టర్ -6, యూనిట్ -22లో మహాశక్తిలో భాగంగా బాబు ష్యురీటి – భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా యూనిట్ ఇంఛార్జ్ అక్కిరెడ్డి వెంకటరమణ గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రజావేదిక కార్యక్రమంలో *శృంగవరపుకోట నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ & మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి* పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన నియోజకవర్గ ఇంచార్జ్ కోళ్ల లలిత కుమారికి మహిళలు, ప్రజలు & పార్టీ నాయకులు, కార్యకర్తలు అడుగడుగునా ఘనంగా స్వాగతం పలికారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ మహాశక్తి పేరుతో ప్రకటించిన పథకాలు మహిళా సాధికారత చేకూర్చడం, తల్లికి వందనం కింద బిడ్డలను చదివించేందుకు ఒక్కొక్కరికి రూ.15,000 ఇవ్వనున్నాము. ఆడబిడ్డ నిధి ద్వారా 18 పైబడి 60 సంవత్సరాలలోపు వయసున్న ప్రతీ మహిళకు నెలకు రూ.1,500 ఆర్ధిక సహాయం కలిపించనున్నాము. ఆపడుచులకు జిల్లా పరిధిలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నాము. పెరిగిన వంట గ్యాస్ ధరల భారం తగ్గించడానికి ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ఇప్పటికే ప్రకటించిన పార్టీ అధినేత చంద్రబాబునాయుడు గారు తాజాగా అవసరమైతే నాలుగో గ్యాస్ సిలిండర్ ను కూడా అందిస్తామని హామీ ఇచ్చారు. వీటినంటితోపాటు సాగు భారమై రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వారికీ అండగా ఉండేందుకు సంవత్సరానికి రూ.20,000 ఆర్థిక బరోసా చేస్తామని, యువగళం పథకం ద్వారా నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 ఆర్థిక సహాయం, ఐదేళ్లల్లో 20 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. అంతేకాకుండా బీసీలకు రక్షణకు ప్రత్యేక చట్టం, ఇంటింటికి ఉచితంగా తాగునీటి కుళాయిలు వంటి సంక్షేమ పథకాలు అమలుపరుస్తామని అన్నారు. ఈ సందర్భంగా మహాశక్తిలో భాగంగా రాష్ట్ర ప్రజల కోసం విడుదల చేసిన మినీ మేనిఫెస్టో కరపత్రాలను పంచుతూ, వాటిలోని ప్రకటించిన ప్రతీ లబ్దిదారులకు బాబు ష్యురీటి – భవిష్యత్తుకు గ్యారెంటీ పథకాల గురించి క్లుప్తంగా వివరించారు.

*ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యాదర్శి కోళ్ల బాలాజీ అప్పల రాంప్రసాద్, లక్కవరపుకోట మండల పార్టీ అధ్యక్షులు చొక్కాకుల మల్లు నాయుడు, 6వ క్లస్టర్ ఇంఛార్జ్ & మాజీ జడ్పీటీసీ కరెడ్ల ఈశ్వరరావు, మాజీ ఎంపీపీ కొల్లి వెంకటరమణ మూర్తి, మాజీ వైస్ సర్పంచ్ తూర్పాటి వెంకటరావు, ఎల్.కోట మండల పార్టీ ఉపాధ్యక్షులు తూర్పాటి రామారావు, 22వ యూనిట్ ఇంఛార్జ్ అక్కిరెడ్డి వెంకటరమణ, మాజీ మార్కెట్ చైర్మెన్ ఏడువాక సులోచన, కళ్లెంపూడి గ్రామ సర్పంచ్ గుడిశ రాము, టీడీపీ నాయకులు గుమ్మడి త్రిమూర్తులు, పట్రాన ఈశ్వరరావు, ఏడువాక అమ్మాజీ, శానాపతి సత్యవమ్మ, జొన్నపల్లి సత్యవమ్మ, ఏడువాక సత్యవతి, 119వ బూత్ కన్వీనర్ గుడిశ రవికుమార్, 120వ బూత్ కన్వీనర్ జామి సూర్యనారాయణ, 121వ బూత్ కన్వీనర్ అక్కిరెడ్డి ఈశ్వరమ్మ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, యువత, అధిక సంఖ్యలో మహిళలు మరియు తదితరులు పాల్గొన్నారు
[zombify_post]