గిరిజన తండాల అభివృద్ధి కోసం నిధులు మంజూరు
– ప్రత్యేక చొరవతో కృషి, మంత్రి కొప్పుల ఈశ్వర్,

ధర్మారం.సెప్టెంబర్.07 ( కామన్ మాన్ న్యూస్ గురు ): ధర్మపురి,నియోజకవర్గంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, గిరిజన తండాల అభివృద్ధి కోసం ప్రత్యేక చొరవతో కృషి చేస్తు గిరిజన శాఖ నుండి రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 243 ద్వారా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తపల్లి గ్రామం నుండి నాయకం గిరిజన తండా వరకు బీటి రోడ్డు నిర్మాణానికి 15 లక్షలు మంజూరు కాగా గిరిజన తండాల అభివృద్ధి కోసం మంత్రి కొప్పుల కృషి చేసినందుకు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కొప్పుల ఈశ్వర్, చిత్రపటాలకు పాలభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కమిటీ రెడ్డి లలిత- బుచ్చిరెడ్డి, ఉప సర్పంచ్ రవి నాయక్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కమిటీ రెడ్డి బుచ్చిరెడ్డి, వార్డు సభ్యులు లాలునాయక్ బొల్లి శ్రావణి సురేందర్ నాయక్ బద్ది శ్రీను గ్రామ శాఖ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి బొల్లి రాములు జలపతి నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]