జామి మండలం, అలమండ గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త సిరికి శ్రీనివాసరావు అకాల మరణ వార్త తెలుసుకున్న శృంగవ రపుకోట నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, ఆదివారం అతని కుటుబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. టీడీపీ తరుపున మీ కుటుంబానికి ఎల్లప్పుడూ తోడుగా ఉంటామని భరోసా చెప్పారు. ఈ కార్యక్రమంలో అలమండ గ్రామ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శి లగుడు అప్పల నాయుడు మాస్టర్, పాటూరు ఎర్రినాయుడు, ఎంపీటీసీ డెక్కా శ్రీను, వెలమ కార్పోరేషన్ డైరెక్టర్ కొట్టాన విజయ్ కుమార్, వార్డు మెంబర్ పైల కృష్ణ, మాజీ వార్డు మెంబర్ శిరా సోములు, సిరా రాము, ముగడ రమణ, నారాయణపురం పైలా గోవింద, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు..
[zombify_post]