నారా చంద్రబాబు నాయుడు అరెస్టు నిరసిస్తూ లింగపాలెం మండలం రంగాపురం గ్రామంలో టిడిపి ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే గంట మురళి రామకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబుపై అక్రమ అరెస్టులు చేసి ప్రభుత్వం కక్ష సాధింపు చర్య చేస్తుందన్నారు. నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.
[zombify_post]