జామి మండలం భీమసింగి పంచాయతీ పరిధిలోని ఉన్న చిల్లపాలెం గ్రామానికి చెందిన ఎండ్రెడ్డి పోతురాజు అనే వ్యక్తి డయాలసిస్ వ్యాధితో మంగళవారం రాత్రి మరణించాడు. మంగళవారం బాధిత కుటుంబానికి సచివాలయ కన్వినర్ మజ్జి హరీకృష్ణ, స్థానిక వైసీపీ నాయకులు సత్యం నాయుడు చేతులు మీదుగా వైఎస్సార్ భీమా తక్షణ సహాయం 10, 000 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసిస్టెంట్ రామారావు, వార్డ్ మెంబర్ తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]