బిడ్డకు తల్లిపాలతోనే సంపూర్ణ ఆరోగ్యం
తల్లిపాలు బిడ్డకు ఎంతో శ్రేయస్కరమని, ఆరునెలల వరకు పిల్లలకు తల్లిపాలు పట్టాలని పోలాకి పంచాయతీ సర్పంచ్ మజ్జి రమణమ్మ సూచించారు. పోలాకి మండల కేంద్రంలో స్త్రీశిశుసంక్షేమశాఖ అధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన పోషకాహార మాసోత్సవంలో పాల్గొన్నారు. గర్భిణులు, బాలింతలకు సంపూర్ణ పౌష్టికాహార కిట్లను అందజేశారు. సూపర్వైజర్ శ్రీదేవి మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ఆహార పదార్థాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
[zombify_post]
