రాజ్యసభ సభ్యులు,బీఆర్ఎస్ కొత్తగూడెం నియోజకవర్గ ఇంఛార్జి వద్దిరాజు రవిచంద్రకు జూలూరుపాడులో పార్టీ శ్రేణులు ఆత్మీయ స్వాగతం పలికారు. ఖమ్మం నుంచి కొత్తగూడెం బయలుదేరిన ఆయనకు జూలూరుపాడు చౌరస్తా వద్ద జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ దిండిగల రాజేందర్,ఎంపీపీ లావుడ్య సోని, మున్నూరుకాపు సంఘం నాయకులు బాపట్ల మురళి,రామిశెట్టి రాంబాబుల ఆధ్వర్యంలో పటాకులు కాల్చుతూ,డప్పు వాయిద్యాలతో వందలాది మంది అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రవిచంద్ర రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. గులాబీ శ్రేణులు ఎంపీ వద్దిరాజు, మున్నూరు కాపు ఖమ్మం జిల్లా అధ్యక్షులు పారా నాగేశ్వరరావులను గజమాలతో సత్కారం చేసి,పలు వాహనాలలో కొత్తగూడెం బయలుదేరారు.
[zombify_post]