అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీతో జనసేన పార్టీ పొత్తు పెట్టుకోవడంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకోవడంపై బీజేపీ అధిష్టానం పరిశీలించి, నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.పొత్తులపై ఎవరెన్ని ప్రకటనలు చేసినా.. అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేశారు. మేము జనసేన పార్టీతో ఇంకా పొత్తులోనే ఉన్నామని చెప్పారు.
This post was created with our nice and easy submission form. Create your post!