డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
రావులపాలెం 14వ రోజు రిలే దీక్షలో సత్యానందరావు వినూత్న నిరసన.

చంద్రబాబునాయుడి అక్రమ అరెస్టును నిరసిస్తూ కొత్తపేట నియోజకవర్గ టిడిపి ఇంఛార్జ్ బండారు సత్యానందరావు ఆదేశాలతో పద్నాలుగువ రోజు క్లస్టర్ – 2 ఆద్వర్యంలో రిలే నిరాహారదీక్ష చేపట్టారు.
క్లస్టర్ – 2 లో అంకంపాలెం,మెర్లపాలెం,లొల్ల,నార్కెడిమిల్లి,ర్యాలి,కట్టుంగ,వాడపల్లి గ్రామాలకు చెందిన క్లస్టర్,యూనిట్ ఇంఛార్జ్ లు పాల్గొన్నారు. క్లస్టర్2 ఇంఛార్జీ కరుటూరి నరసింహారావు, లొల్ల సర్పంచ్, క్లస్టర్2 ఇంఛార్జీ కాయల జగన్నాధంల పర్యవేక్షణలో దీక్ష జరుగుతుంది. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ ప్రజా పాలనా, రాష్ట్ర అభివృద్ధి గాలికి వదిలేసి ప్రతిపక్షాలపై కక్ష రాజకీయాలే జగన్ చేస్తున్నారని అన్నారు.
అంబేద్కర్ రాజ్యాంగ పాలన మానేసి రాజారెడ్డి రాజ్యాంగ అమలు చేస్తున్న జగన్ దున్నపోతు నిద్రమాని మేలుకోవాలని అన్నారు. అందుకే జగన్ మేలుకుని ప్రతిపక్షాలపై అక్రమ అరెస్టులు ఆపాలని దున్నపోతుకు వినతి పత్రాన్ని సమర్పించి సత్యానందరావు వినూత్న నిరసన తెలియజేశారు.
దున్నపోతు లాంటి వైసీపీ ప్రభుత్వానికి బుద్దిని ప్రసాదించు దేవుడా అని,
ప్రజలిచ్చిన అధికారంతో నియంతలాగ ప్రవర్తిస్తే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని సత్యానందరావు అన్నారు.
రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు జాగ్రత్త సీఎం జగన్ ప్రజలు తగిన బుద్ది చెప్తారు చూస్తూ ఉండండి.
ఈకార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి, కొత్తపేట నియోజకవర్గ పరిశీలకులు వాసిరెడ్డి రాంబాబు మరియు మాజీ యం.పి.అయితాబత్తుల బుచ్చిమహేశ్వరరావు అధిక సంఖ్యలో క్లస్టర్2 గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!