టిడిపి జిల్లా సెక్రెటరీ కే. భూపాల్ చౌదరి గారు దీక్ష శిబిరాన్ని సందర్శించి ఎస్సీ వర్గీకరణ న్యాయమైన డిమాండ్ అని మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు చేస్తున్న ఈ పోరాటానికి మా టిడిపి మద్దతు ఉంటుందని కొనియాడారు. ఈ కార్యక్రమానికి టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొని సంఘీభావం తెలిపారు. మాన్యశ్రీ మందకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు ఈనెల 18 నుండి 22వ తేదీ వరకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు బిజెపి ప్రభుత్వము చట్టబద్ధత కల్పించాలని ఎమ్మార్పీఎస్, ఎం ఎస్ పి ఆదోని శాఖ డిమాండ్ చేస్తూ స్థానిక ఆదోని పట్టణం బీమాస్ సర్కిల్ దగ్గర ఎమ్మార్పీఎస్, ఎం ఎస్ పి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించడం జరిగింది. దీక్షలు కూర్చున్న వారు ఎం ఎస్ పి జిల్లా కో- కన్వీనర్ బండారి హనుమంతు మాదిగ, ఎం ఎస్ పి జిల్లా నాయకులు ఇస్వి నాగప్ప మాదిగ, ఎం ఎస్ పి జిల్లా నాయకులు పిఎస్ వీరేష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ ఆదోని మండల అధ్యక్షులు బండారి గిట్టయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ మాజీ అధ్యక్షులు ఎం జగన్ మాదిగ, ఎమ్మార్పీఎస్ టౌన్ నాయకులు టి ఈరన్న మాదిగ, ఎం ఎస్ పి మండల నాయకులు దిబ్బనకల్ హుసేన్ అప్ప మాదిగ, ఎమ్మార్పీఎస్ టౌన్ నాయకులు జిఎస్ దత్తు మాదిగ, ఈ కార్యక్రమంలో ఎం ఎస్ పి జిల్లా కో కన్వీనర్ బండారి హనుమంతు మాదిగ, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు పి. గోవిందరాజులు మాదిగ, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు రైల్వే ఈరన్న మాదిగ, వీరు మాట్లాడుతూ………. ఎమ్మార్పీఎస్ సుదీర్ఘ పోరాటంలో అలుపెరుగని ఉద్యమాలు చేస్తూ 29 సంవత్సరాలుగా మన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో గుండె జబ్బు పిల్లలుకు ఆరోగ్యశ్రీ పథకం, వృద్ధులు, వితంతువులకు 200 నుండి పెన్షన్ పెంచడం, వికలాంగుల హక్కుల కోసం ఉనికి ఘన చరిత్రకారుడు ఎస్సీ 59 కులాలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగంలో అభివృద్ధి జరగాలంటే ఎస్సీ వర్గీకరణకు ఈ పార్లమెంట్ సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టబద్ధత కల్పించి 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామన్న మాటను నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిలబెట్టుకోవాలని అదేవిధంగా వైయస్సార్సీపి పార్టీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ బిల్లుకు అసెంబ్లీ తీర్మానం చేసి వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయంలో ఎస్సీ వర్గీకరణ కూడా ఉందని మరచి పోకుండా మాదిగలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన మాదిగల అగ్రహానికి గురికాక తప్పదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఎం ఎస్ పి జిల్లా నాయకులు ఎస్ బాలన్న మాదిగ, ఎమ్మార్పీఎస్ ఆదోని పట్టణ అధ్యక్షులు గుమ్ముల బాలస్వామి మాదిగ, ఎం ఎం కాలనీ శ్రీధర్ మాదిగ, పర్వతపురం వేణు మాదిగ, గోపాల్, నారాయణ, తిమ్మప్ప, లుర్దయ్య సార్, అంజనప్ప, జగదీష్రా, మలింగ రాజు, లాలప్ప, మరియు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మాదిగ ఉద్యోగస్తులు, మాదిగ ఉపకులాలు, ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు ఈ దీక్ష కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడానికి తమ వంతు కృషిని అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

[zombify_post]